Party Launch · Volume 1, Edition 1Filed under: General DisgruntlementSponsored by no one. Funded by nothing.HQ: Wherever the wifi worksNow accepting rants, retweets, and resentmentParty Launch · Volume 1, Edition 1Filed under: General DisgruntlementSponsored by no one. Funded by nothing.HQ: Wherever the wifi worksNow accepting rants, retweets, and resentment
Education5/10· MODERATE

The govt of tamilnadu to appoint teachers of linguistic minorities

Kethireddy JagadishwarareddyREQ / 15809
Tamilnadu, Chennai, Tamil Nadu

పత్రికా ప్రకటన

భాషా విధానంపై రాజకీయ గందరగోళంతో తెలుగు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

– తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

చెన్నై, 30-05-2026:

భాషా విధానంపై తమిళనాడులో రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతోంది.

గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి గాఉన్న శ్రీ ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందీని హిందీ కాని రాష్ట్రాలపై పరోక్షంగా రుద్దే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే కొనసాగుతాయని, మూడు భాషల విధానాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె. అన్నామలై నేటి ప్రకటన లో ఆరో తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని స్వాగతించినప్పటికీ, ఈ ఏడాది నుంచే తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ముందుగా 2029-30 నుంచి అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా మార్పు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపుతుందని అన్నారు. ఈ ఇద్దరు నాయకుల విభిన్న ప్రకటనలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.

మూడు భాషల విధానం అంటే ఏమిటి? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఐదో తరగతి వరకు, వీలైతే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని ఆ విధానం సూచిస్తుంది. యునెస్కో ఎన్నో ఏళ్లుగా పిల్లలు తమ మాతృభాషలో విద్యను ప్రారంభిస్తే పాఠాలు బాగా అర్థమవుతాయని, ఆలోచనా శక్తి పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతోంది. తమిళనాడులో తెలుగు పిల్లల పరిస్థితి తమిళనాడులో రెండు భాషల విధానం కొనసాగుతున్నా తెలుగు భాషా ఉపాధ్యాయులను ప్రభుత్వం తగిన సంఖ్యలో నియమించలేదు. తెలుగు మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో పరిగణించడం లేదు. దీంతో అనేక తెలుగు కుటుంబాలు తమ పిల్లలను బలవంతంగా తమిళ మాధ్యమంలో చదివించాల్సి వస్తోంది. ఇది తెలుగు భాషకు నష్టం కలిగిస్తోంది. మన పిల్లలు తమ మాతృభాషను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కర్ణాటక సరిహద్దు అయిన కేరళలోని కాసరగోడ్ ప్రాంతంలో మలయాళం మొదటి భాషగా తప్పనిసరి చేసే బిల్లువలన కన్నడ మాట్లాడే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమిళనాడు తెలుగు యువశక్తి డిమాండ్లు

  1. వెంటనే తమిళనాడు లో తెలుగు భాషా ఉపాధ్యాయులను నియమించాలి
  2. మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో కలపాలి
  3. ప్రతి విద్యార్థికి తన మాతృభాషలో చదివే హక్కును గౌరవించాలి
  4. విద్యా విధానాల లో తల్లిదండ్రుల కమిటీ లను ఏర్పాటు చేసి వారి అభిప్రాయం ని సేకరించి నిర్ణయలు తీసుకొనే విధంగా ఒక చట్టాన్ని కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అమలుచేయలి. బాష ల కొరకు ఉద్యమలు.కొట్లాటలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ని కోరారు “మా భాష – మా హక్కు” “మాకు తెలుగు నేర్చుకునే హక్కు కావాలి” విడుదల చేసిన వారు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తమిళనాడు తెలుగు యువశక్తి 16/10A, తిలక్ స్ట్రీట్, టి. నగర్, చెన్నై – 600017 ఇమెయిల్: tnteluguyuvasakthi@gmail.com ఫోన్: 9700022232 / 9100302220

కేతిరెడ్డి UNESCO india విభాగానికి కూడా ఒక లేక రాశారు............

Subject: Complaint regarding violation of Mother Tongue Education Rights for Telugu Children in Tamil Nadu

Dear UNESCO New Delhi,

I am Kethireddy Jagadish Wara Reddy, Founder President of Tamilnadu Telugu Yuva Sakthi. In Tamil Nadu, the government is not appointing Telugu linguistic teachers. Mother tongue exam marks are not counted in the total. Because of this, many Telugu children are being forced to study in Tamil medium and are losing their mother tongue. This is against UNESCO’s own position that children learn best in their mother tongue. I request UNESCO to kindly look into this serious issue and take necessary action to protect Telugu children’s right to learn in their own language. I am ready to provide all supporting details.

Thank you.

( Kethireddy Jagadish Wara Reddy) Founder President Tamilnadu Telugu Yuva Sakthi --- Email.tnteluguyuvadakthi@gmail.com 9700022232

newdelhi@unesco.org

0 comments
Members only

Join the swarm to support this issue.

Free, lifelong, and about 30 seconds with your Google account. No spam, no fees — just a number and a voice.

0 Comments

No comments yet.

Members only

Join the swarm to join the discussion.

Free, lifelong, and about 30 seconds with your Google account. No spam, no fees — just a number and a voice.